Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని గంగిరేనిగూడెం, సూర్యనాయక్ తండాల్లో సర్పంచ్గా ఏకగ్రీవగా ఎన్నికైన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు మంగళవారం భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎంపికైన సర్పంచులను ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర జ్యోతి శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచు లు శానం మంజుల, పరమేశ్వర్, భూక్య రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మెతుకు తిరుపతిరెడ్డి, నాయకులు రామ్ శెట్టి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.