Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ఓటర్లకు అంద జేస్తున్న ఓటర్ స్లిప్పులు తప్పులతడకగా మారాయి. గ్రామ పంచా యతీ ఎన్నికలు రెండో విడత ఈ నెల 25న శాయంపేట మండ లంలో నిర్వహిస్తుండగా, ఓటర్ స్లిప్లలో మాత్రం ఈనెల 21న ఎన్ని కల తేదీ అని ముద్రితమై ఉంది. అధికారులు మాత్రం ఆ తేదీని మార్చకుండా అలాగే ముద్రితమై వచ్చిన ఓటర్ల స్లిప్ లను ఓటర్లకు వీఆర్ఏ, బూత్ లెవెల్ ఆఫీసర్ ల ద్వారా అందజేస్తున్నారు. ఓటర్ల జాబితాలో ఒకరి ఫొటోకు బదులుగా మరొకరి ఫొటోలు ముద్రితమై ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణలు చేస్తున్నా తప్పుల తడకగానే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటరు జాబి తాను తప్పులు లేకుండా సవరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.