Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
గ్రామపంచాయతీ సర్పంచి అభ్యర్థిత్వంలో జరిగిన మార్పులతో టీిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తన సతీమణితో మండల కేంద్రంలోని బస్టాండ్ లో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామ శాఖ అధ్యక్షుడు తో చర్చించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ధర్నాలకు అనుమతి లేదని ధర్నా విరమింపచేశారు. ఆరెపల్లె గ్రామానికి చెందిన దుంపల మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ శాయంపేట పట్టణ శాఖ అధ్య క్షుడిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరెపల్లె గ్రామాన్ని గ్రామ పంచాయతీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేయడం పంచా యతీ ఎన్నికల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో తన సతీమణి దుంపల శ్రీలతను టిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న దుంపల తిరుపతి రెడ్డి ఇటీవల మాజీ స్పీకర్ సిరికొండ మధు సూదనాచారి అనుమతితో టీిఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో మనోవేదనకు గురైన మహేందర్ రెడ్డి తన సతీమణితో శాయంపేట బస్టాండ్ కూడలిలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న సీఐ షాదుల్లా బాబా, ఎస్సై రాజబాబు సిబ్బందితో చేరుకొని మహేందర్ రెడ్డి తో చర్చించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ధర్నాలకు అనుమతి లేదని శాంతింపజేసి ఆందోళన విరమింపజేశారు.