Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడున్నరేండ్ల నుంచి తనిఖీలు, చర్యలు లేవు
- ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ప్రయివేటు ఆస్పత్రులు
- నిబంధనలకు నీళ్లోదిలి.. దోపిడీకి తెగబాటు
- గర్భ నిర్ధారణ పరీక్షలపై చర్యలు శూన్యం
- ఓపికి రూ 300ల నుంచి 1000 వరకు వసూల్
- వైద్య ఆరోగ్యశాఖ తీరుపై సర్వత్రా నిరసన
నవతెలంగాణ-కార్పొరేషన్
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలకే పరిమితమవుతున్నది కార్యాలయం చిరునామా అందరికీ తెలిసిన తనిఖీలు, చర్యలు తీసుకోవడంలో మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. కేవలం ప్రకటనలకే పరిమితమవుతూ పేపర్ పులిగా మారిపోయింది. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు తప్ప మిగతా పనుల వైపు కన్నెత్తి కూడ చూడని వింత పరిస్థితిని ఎదుర్కొంటుంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన పల్స్పోలియో, వారానికి ఒకమారు చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్, ఎన్సీడీ కార్యక్రమాలు, రాజీవ్ బాలల స్వస్థ రక్ష లాంటి కార్యక్రమాలకే పరిమితమైపోయారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా రక్షణగా నిలవాల్సిన అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రోగులు ప్రయివేటు ఆస్పత్రులకు రోగ నిర్ధారణ, వైద్యం కోసం వెళుతూ లక్షల రూపాయలను ఖర్చు చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. మూడేండ్ల నుంచి ఒక్కమారు కూడ ప్రయివేటు ఆస్పత్రులు, నర్సింగ్హోంలు, క్లీనిక్లు, రోగ నిర్ధారణ కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లవైపు కన్నెత్తి కూడ చూడకపోవడంతో ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రజల రోగాలతో ప్యాపారం చేస్తూ కోట్ల రూపాయలను అక్రమంగా సంపాధిస్తున్నారు. వైద్యంను వ్యాపారంగా మార్చి కోట్లకు పడగలెత్తుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ప్రజల రక్త, మాంసాలతో వ్యాపారం...
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వరంగల్ అర్భన్ అధికారులు తన ఉనికిని కోల్పోయింది. నగరంలోని ఆస్పత్రులవైపు కన్నెత్తి కూడ చూడకపోవడంతో ప్రయివేటు ఆస్పత్రులు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. అడిగే వారు లేరనే ధైర్యంతో నగరంలోని ప్రయివేటు ఆస్పత్రులు నిబంధనలను నీళ్లోదిలాయి. ఇష్టారీతిన వ్యవహరిస్తూ దందాకు తెరలే పుతున్నాయి. నగరంలో సుమారు 400లకు పైగా నర్సింగ్హోంలు, కార్పొరేట్ ఆస్పత్రులు, క్లీనిక్లు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా నిబంధనలకు నీళ్లోదిలాయి. ఆస్పత్రికి చెందిన రిజిష్ట్రేషన్ నెంబర్, నర్సింగ్ కౌన్సిల్ రిజిష్ట్రేషన్ నెంబర్తోపాటు వైద్యుల వివరాలు, వైద్యులు చదివిన, చదువు, వారి హోదా, వైద్యులు తీసుకుంటున్న ఫీజు వివరాలు, సంబంధిత ఆస్పత్రిలో రోగ నిర్ధారణకు అయ్యే ఫీజు వివరాలు, పని చేస్తున్న పారా మెడికల్ సిబ్బంది పేర్లు, వారి చదువు, హోదా ఇలా అన్ని రకాల వివరాలు ఆస్పత్రికి చెందిన ప్రధాన గేటు వద్ద, లోపల ఉంచాల్సి ఉంటుంది. కాని ఇవేమి ప్రస్తుతం కనిపించడంలేదు. ఇదిలావుంటే ఒక అవగాహన ప్రకారంతోనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రయివేటు ఆస్పత్రుల వైపు కన్నెత్తి కూడ చూడటంలేదనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అనేకమార్లు డీఎంహెచ్వో డాక్టర్ హరీష్రాజ్ ప్రయివేటు ఆస్పత్రులను తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారే కాని ఒక్క ఆస్పత్రిపై కూడ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి.
ఒక్కో వైద్యుడు..ఒక్కో ఫీజు...
నగరంలోని చాలా మంది వైద్యులు రోగుల వద్ద నుంచి ఒక్కో ఫీజు వసూలు చేస్తున్నారు. హన్మకొండ చౌరస్తా, బాలస ముద్రం, కాకాజీకాలనీ, వరంగల్ జేపీఎన్ రోడ్డుల వద్ద ఉన్న సూపర్ స్పెషాలిటీ వైద్యుల తీరు మరింత దారుణంగా ఉంది. రోగికి అత్యవసర వైద్య సేవలు అందించడానికి మరింత ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు ముఖ్యంగా న్యూరో ఫిజీషీయన్, న్యూరో సర్జన్, గుండె వ్యాధులకు చెందిన ఫిజీషియన్, సర్జన్, పిల్లల సర్జన్లు, చెవి, ముక్కు, గొంతు వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలాజిస్ట్లతోపాటు ఇతర విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలజిస్టులు అధిక ఫీజులు వసూలు భహిరంగంగానే చేస్తున్నారు. సాధాణరంగా రూ.200ల నుంచి 500ల వరకు వీరి ఫీజలు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే కొత్తవాడలోని ఓ సూపర్ స్పెషాలిటి వైద్యుడు ఏకంగా రూ. 1000 వరకు ఓపి (అవుట్ పేషెంట్) వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇందులో ఓపి చిట్టీ తీసుకున్న వారికి రూ. 500లు, డైరెక్టుగా ఎలాంటి చీటి లేకుండా నేరుగా డాక్టర్ను కలువాలంటే రూ. 1000లు సమర్పించాల్సిందే. ఇలా కొంతమంది వైద్యులు సేవా రంగంను నేడు వ్యాపార రంగంగా మార్చేశారు.
యథేచ్ఛగా గర్భ నిర్ధారణ...
వరంగల్, హన్మకొండ, ఖాజీపేట పట్టణాల్లో సుమారు 250కి పైగానే డయాగస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఆస్పత్రులకు అటాచ్డ్గా రోగ నిర్ధారణ సెంటర్లు, ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా హన్మకొండ చైరస్తా కాకాజీకాలని, నయీంనగర్, బాలసముద్రం, కాశిబుగ్గ, వరంగల్ చౌరస్తా కేంద్రాలుగా స్కానింగ్ కేంద్రాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. వీటిలో చాలా వరకు నిబంధనలకు వ్యతిరేఖంగా గర్భ నిర్ధారణ జరుగుతున్నది. రహస్య ప్రాతిపధికన గర్భ విచ్చిన్నాలు జరగుతున్నాయి. ఇందుకు అనేక ఘటనలు ప్రత్యక్ష తార్కాణాలు నిలుస్తున్నాయి. అయినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్కానింగ్ సెంటర్లవైపు కన్నెత్తి కూడ చూడని దుస్థితి నెలకొంది.
రహస్య ఒప్పందం ఏమైనా ఉందా?
వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏమైన ఉన్నాయా? అనే ప్రశ్నలు ఉత్నన్నం అవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మౌనంగా ఉండిపోవడానికి గల కారణాలు ఏమిటనే ప్రశ్నలు ప్రతి ఒక్కరికి తొలుస్తున్న ప్రశ్న. దీనికి అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. గతంలో అనేకమార్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్రాజ్ గర్భ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్న నర్సింగ్ హోంలు, ప్రయివేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంత వరకు చర్యలు తీసుకోవడంలో మీనవేశాలు వేయడానికి కారణాలు ఏమిటనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.