Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెరవెనుక ఎమ్మెల్యేలు
- కాంట్రాక్టర్ల ఒత్తిడి..
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా పని చేసిన వీపీ గౌతం బదిలీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలే కారణం. గౌతం బదిలీ కోసమే ఎమ్మెల్యేలు కేటీఆర్తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మేయర్ ఎంపిక కోసం కేటీఆర్, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. కేటీఆర్తో 'గ్రేటర్' పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేల చర్చల నేపథ్యంలోనే యుద్ధప్రాతిపదికన కమిషనర్ గౌతం బదిలీకి ఉత్తర్వులు వచ్చాయి. ఆ వెంటనే నాన్ ఐఎఎస్ కేడర్ అధికారి రవికిరణ్ను నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. దీని వెనుక ఆ ఎమ్మెల్యేల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఎమ్మెల్యేల రాజకీయాలకు మరో ఐఏఎస్ అధికారికి రాజకీయ బదిలీ తప్పలేదు.
జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా ఐఏఎస్ కేడర్ అధికారి గౌతం 10 నెలల కాలంలో తనదైన శైలిలో పాలన సాగించారు. మేయర్ నన్నపునేని నరేందర్ ఆదేశాలు పాటించకపోవడం నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు ప్రచారం జరిగింది. ముందస్తు ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నన్నపునేని నరేందర్ నామినేషన్ ఒకానొక దశలో తిరస్కరణకు గురైందన్న ప్రచారం జరిగింది. ఈ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా గౌతం వ్యవహరించిన విషయం విదితమే. ఈ వ్యవహారం సీఎం కేసీఆర్, నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. నాటి నుంచి గౌతమ్, నరేందర్ల నడుమ మరింత అగాధం పెరిగింది. నాసిరకపు పనులు చేసిన
కేటీఆర్ ఆదేశంతో..
కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా నిలిపివేయడం, అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించిన నేపథ్యంలో కమిషనర్ గౌతంపై ఎమ్మెల్యేలు కినుక వహించారు. స్మార్ట్సిటీ, హృదరు, అమృత్ పథకాల డీపీఆర్లు రూపొందించడంలో గౌతం కీలక పాత్ర పోషించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లలో చిరు వ్యాపారుల డబ్బాలు తొలగించడంతో ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. వేకువజామునే సైకిల్పై డివిజన్లలో ఆకస్మికంగా పారిశుద్ధ్య పనుల తనిఖీ చేయడంతోపాటు నగరవాసుల అర్జీలకు సత్వరమే స్పందించే అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
గౌతం ప్రవర్తనపై ఎమ్మెల్యేల అసంతృప్తి
'గ్రేటర్'లో పనులను కమిషనర్గా గౌతం స్వయంగా పరిశీలించడాన్ని ఎమ్మెల్యేలు జీర్ణించుకో లేకపోయారు. పనుల నాణ్యత విషయంలో నిక్క చ్చిగా వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. మూకుమ్మడిగా ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ను కలిసి కమిషనర్ గౌతంను బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. వెంటనే స్పందించిన కేటీఆర్ ఈ మేరకు ఆదేశించిన క్రమంలో కమిషనర్ గౌతంకు బదిలీ తప్పలేదు. ఇదే క్రమంలో తమ మాట చెల్లుబాటయ్యేలా నాన్ ఐఏఎస్ కేడర్లోని రవికిరణ్ను బదిలీ చేయించడంలో ముగ్గురు ఎమ్మెల్యేలే పాత్ర ఉందని సమాచారం.
'గ్రేటర్'లో మరో రాజకీయ బదిలీ..
ఐఏఎస్ కేడర్ కమిషనర్లను రాజకీయంగా బదిలీ చేయించడం కొత్త కాదు. గతంలో కమిషనర్ గా పని చేసిన నీతూప్రసాద్, స్మితా సబర్వాల్, నాయక్, వివేక్ యాదవ్, సువర్ణ దాస్ పాండా, శృతి ఓఝా రాజకీయంగా బదిలీ అయినవారే. తాజాగా గౌతం బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మె ల్యేల మాట వినకపోతే అధికారులను బదిలీ చేయిస్తు న్నారన్న చర్చ జరగడం గమనార్హం. ఈ విషయంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్, ఇతర స్వచ్ఛంద సంస్థలు కమిషనర్ గౌతం బదిలీని ఖండించారు. హన్మకొండలో మంగళవారం ఒపీనియన్ పోల్ నిర్వహించారు. నవ్విపోదురు గాక.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.