Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం
- టీడీపీ గెలిస్తే అమరావతి నుంచి నిధులు తెస్తారా
- మహబుబాబాద్ ఎంపీ సీతారాంనాయక్
నవతెలంగాణ-వెంకటాపురం
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులను సర్పంచ్ లుగా గెలిపించాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ కోరారు. పంచాయతీల అభి వృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్ర మాలు చేపడుతున్నారని చెప్పారు. టీడీపీ మద ్దతిచ్చిన అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధికి అమరావతి నుంచి నిధులు తీసుకొస్తారా? అంటూ ప్రశ్నించారు. మండల కేంద్రంలోని ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారాంనాయక్ మాట్లాడారు. గ్రామాలను సంపూర్ణంగా అభి వృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ మూడు కిలోమీటర్లలోపు దూరంలోపు ఉండి 500లోపు జనాభా ఉన్న గ్రామాలను పంచా యతీలుగా ఉన్నతీకరించారని చెప్పారు. భద్రా చలం, దుమ్ముగుడెం, చర్ల మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలిచినట్లు తెలిపారు. ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడారు. వాజేడు మండలంలోని మోడికుంట ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయన్నారు.పత్యేక నిధులతో వెంకటాపురం, వాజేడు మండలాల్లో రూ.25లతో 20 సోలార్ లైట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వెంకటాపురం, వాజేడు మండలాలను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వేట్పూరి లక్ష్మినారాయణ, నాయకులు జాగర శివాజీ, మద్దుకూరి నెహ్రూ, సర్పంచ్లు, ఇతరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం...
గోవిందరావుపేట : పంచాయతీల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ కోరారు. పస్రాలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సూడి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారాంనాయక్ మాట్లాడారు. పస్రా, చల్వాయి, గోవిందరావుపేట గ్రామాల్లో త్వరలోనే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. 163వ నెంబర్ జాతీయ రహదారి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. భూక్య సుమలతను గెలిపించి పస్రాను అభివృద్ధి పథంలో ముందుంచాలని కోరారు. సమావేశంలో నాయకులు సంసోత్ రాజన్న నాయక్, బూర సురేందర్, రవి, వెంకన్న, సూడి కృష్ణారెడ్డి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.