Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు
- విద్యుత్ భవన్లో సమీక్షా సమావేశం
నవతెలంగాణ-వరంగల్
మిషన్ భగీరథ పనులకు అంతరాయాలు కలుగకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) అన్నమనేని గోపాల్రావు కోరారు. హన్మకొండ నక్కలగుట్లలోని విద్యుత్భవన్లో వివిధ విభాగాలకు చెందిన విద్యుత్ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమ్మవారిపేట, నాగారం, భీంఘన్పూర్, రేగొండ, చంద్రుగొండ, సైరాంపూర్ 132/33 కేవీ సబ్స్టేషన్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సబ్స్టేషన్లు ఎక్కడ అవసరమో గుర్తించి పురోగతికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి ఒక్క సర్కిల్ వ్యాపార యూనిట్గా ఉంటూ ఖర్చులు, రెవెన్యూ బేరిజు వేసుకుంటూ లాభసాటిగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. మీటర్ సేల్స్ పెంచాలన్నారు. 33/11 కేవీ ట్రిప్పింగ్స్ నివారించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు విశ్లేశించి 10 శాతానికంటే తగ్గేలా చూడాలని సూచించారు. పీటీఆర్ వైఫల్యాలు నివారించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లను డిపార్ట్మెంట్ వాహనాల్లోనే రవాణా చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగస్తులందరూ హెడ్క్వార్టర్స్లో ఉండాలని ఆదేశించారు. టెక్నికల్ పరంగా పురోగతి సాధించాం కాని అదే పురోగతి, ఆర్థిక పరిపుష్టం అయినప్పుడే కంపెనీ ముందుకు సాగుతుందని తెలిపారు. అంతర్గత సామర్థ్యం పెంచకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలన్నారు. రెవెన్యూ కలెక్షన్ నూరు శాతం ఉండేలా చూడాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత బకాయిలు యుద్ధ ప్రాతిపదికన వసూలు చేయాలన్నారు. వర్క్ ఆర్డర్స్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, వినియోగదారుల మొబైల్ నంబర్లు డేటా సెంటర్లో పొందుపర్చాలని చెప్పారు. సమావేశంలో డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, గణపతి, నర్సింగరావు, సంధ్యారాణి, మోహన్రెడ్డి, సీజీఎంలు సదర్లాల్, కిషన్, అశోక్కుమార్, మోహన్రావు, నగేష్, నారాయణ, మధుసూధన్, తదితరులు పాల్గొన్నారు.