Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఓటర్లు మరింత చైతన్యం కావాలని, అవినీతి రహిత సమాజం కోసం ప్రజా సేవకు అంకితమయ్యే ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని స్వీప్ నోడల్ అధికారి, అర్టికల్చర్ జిల్లా అధికారి కేఆర్ లతా అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఓటర్లను చైతన్యం చేయడానికి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కేఆర్ లతా మాట్లాడుతూ ఓటర్ లీస్టులో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని తమకు నచ్చిన రాజకీయ నాయకున్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉందన్నారు. అనంతరం కళాకారుల బృందం ఓటర్ అవగాహన కల్పించేందుకు వివిధ రూపాలలో కళాప్రదర్శనలు నిర్వహించారు. ఈవీఎం, వీవీప్యాడ్ల వినియోగంపై మాక్ పోలింగ్ను నిర్వహించారు.