Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రాజు
నవతెలంగాణ-మరిపెడ
టెన్త్ పరిక్షా పరీక్షాల్లో సమయ స్ఫూర్తి అవసరమని, ప్రణాళిక ప్రకారం రాస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మహబూబాబాద్ జిల్లా దళిత అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ రావూరి రాజు అన్నారు. శుక్రవారం మరిపెడ మండల కేంద్రంలోని దళిత అభివృద్ధి శాఖ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల కోసం ప్రత్యేక వసతులను పరిశీలించారు. పరీక్షలపై తగిన సూచనలు చేశారు. వాచ్మెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రభుత్వం కల్పించిన వసతులను సక్రమంగా ఉపయోగించుకుని భవిష్యత్తుకు దిక్సూచిగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ జిల్లా కార్యదర్శి ఐనాల పరుశురాములు, సిబ్బంది జయమ్మ, సుగుణమ్మ, వసంత, భద్రం పాల్గొన్నారు.