Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీపీఓ జయంతి
నవతెలంగాణ-పాలకుర్తి
విద్యార్థుల ఎదుగుదలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఐసీడీఎస్ కొడకండ్ల ప్రాజెక్టు సీడీపీఓ జయంతి సూచించారు శుక్రవారం మండల కేంద్రంలో పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతారావుతో కలిసి పోషకాహార వారోత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్లు తహారా బేగం, మల్లీశ్వరి, ఉప సర్పంచ్ తరాల చంద్రబాబు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..
గూడూరు : పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం సాధ్యమని, గర్భిణులు పోషకాహారాలు తీసుకోవాలని సీడీపీఓ నీలోఫర్ అజ్మీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో చంద్రగూడ అంగన్వాడి సెంటర్లో పోషక అభినరు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గర్భిణులు పోషకాహారాలు తీసుకో వడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన్న కార్యక్రమాలు నిర్వ హిం చారు. ఈ కార్యక్రమానికి ఏసీడీపీఓ సంపద కుమారి, సూపర్వైజర్ లాలస, అంగన్వాడీ కార్యకర్తలు మంగ, రామక్క, ప్రకృత, మంగమ్మ పాల్గొన్నారు.
కురవి : మండల కేంద్రంలోని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు గర్భిణులకు, బాలింతలకు సారె అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బండారి ఉమామహేశ్వరి, అరుణ, భద్రకాళి, సుజాత, శ్రీలక్ష్మి, జ్యోతి, గర్భిణులు వాసంతి, నందిత, బిందు, రజిత, స్వప్న, భార్గవి తదితరులు పాల్గొన్నారు.
కాంపెల్లిలో..
మండలంలోని కాంపల్లి గ్రామంలో స్థానిక అంగన్వాడీ కేంద్రం లో పోషణ పక్షం ఉత్సవాలు నిర్వహిచారు. గర్భిణులకు సర్పంచ్ తోట శోభా రాణి, అంగన్వాడీ సూపర్వైజర్ గోపమ్మ సామూహిక సీమంతం నిర్వహించారు. గర్భిణులకు స్వీట్లు అందజేవారు. ఇద్దరు చిన్నారులకు రిటైర్డ్ లెక్చరర్ రమేష్ అన్నప్రాసన్నం చేసి నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పీ .విజయలక్ష్మి, పీ సుమతి, కే లలిత పాల్గొన్నారు.