Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో మొక్కల పెంపకం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన నర్సరీ పనులను స్థానిక సర్పంచ్ ముకిరాల మధు వంశీక ష్ణ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు. అనంతరం నర్సరీ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధు వంశీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హరి తహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు తమ వంతు క షి చేస్తామ న్నారు. మానవ జాతి మనుగడ కొనసాగాలంటే పచ్చని చెట్లను పెంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్లపల్లి స్వప్న కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ పర్లపల్లి రాజ భద్రయ్య, వార్డ్ మెంబర్ రజిత, గ్రామస్తులు సాంబయ్య, లటికే రాజు, రాజ కొమురు తదితరులు పాల్గొన్నారు.