Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్లపల్లి
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ శాశన మండలి ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ అధికార అభ్యర్థి పూల రవీందర్ గెలుపుఖాయమని పి ఆర్ టి యు టి ఎస్ మొగుల్లపల్లి మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సామంతుల సదానందం, పోలు నాగరాజు లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఓటింగ్ సరళిపై మాట్లాడుతూ పీఆర్టీయూటీఎస్ అధికార అభ్యర్థి పూల రవిందర్ కే ఉపాద్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటు వేశారని తెలిపారు. మొగుళ్లపల్లి పోలింగ్ కేంద్రంలో మొత్తం21 మంది ఓటర్లు ఉండగా17మంది ఓటును వినియోగించు కున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు రాజయ్య, రాజ్ కుమార్, దామోదర్, రాము, మార్కండేయ, ప్రసాద్,శ్రీమన్నారాయణ, రాజమౌళి, రఘు, శ్రీనివాస్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.