Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వేబ్రిడ్జి' రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ షావలీ
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణి వేబ్రిడ్జిల వద్ద పని చేస్తున్న లోడింగ్, అన్ లోడింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం చొరవ చూపకుండా మొండి వైఖరి వహి స్త్తోందని, వేబ్రిడ్జి లోడింగ్, అన్లోడింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్షావలి అన్నారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని 5వ ఇంక్లైన్ కాంటా వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేబ్రిడ్జిల వద్ద సు మారు 2వేల మంది కార్మికులు సింగరేణిని నమ్ముకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని, కనీసం కాంట్రాక్ట్ కార్మికులుగా కూడా యాజమాన్యం గుర్తించడం లేద న్నారు. ఇటు సింగరేణి యాజమాన్యం, అటు బొగ్గు కొను గోలు చేసే బయ్యర్లుగాని ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, లారీ యజమాని ఇచ్చే డబ్బులే మా జీవ నాధా రమన్నారు. అది కూడా వివిధ ఏరియాలలో వివిధ రకాలుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏండ్లుగా మేము దుర్భర జీవితాన్ని గడుపు తున్నామన్నారు. తమపౖౖె సింగరేణి యాజమాన్యం చిన్న చూపేంటో అర్ధం కావడం లేదన్నారు. ఎన్ని పోరాటాలు, జీఓలు వచ్చినా యాజమాన్యం మాత్రం తమ పట్ల మొండిగానే వ్యవహరిస్తుందని ఇకనైనా మమ్ములను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత, సీఎంపీఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనాలు కల్పించాలన్నారు. లేకుంటే ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వేసవిలో సింగరేణి పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే ఓఆర్ఎస్, మజ్జిగ, తాగునీరు, రెస్ట్ షెడ్లు ఏర్పాటు చేయాలని ఆయన డమాండ్ చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి డివిజన్ అధ్యక్షులు పేషాల రాజయ్య, రాష్ట్ర కోశాధికారి బానోతు రాజునాయక్, డివిజన్ కార్యదర్శి సారంగపాణి, రవీందర్, ప్రవీణ్, గట్టయ్య, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.