Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు గత ఫిబ్రవరిలో జరిగిన ఐఎన్టీఎస్ఓ ఫైనల్ లెవల్ కాంపిటీటివ్ పరీక్షలో మొ దటి ర్యాంకు, ఐదవ ర్యాంక్, గోల్డ్మెడల్స్ను సా ధించి ప్రతిభ కనబర్చారు. 4వ తరగతికి చెందిన సీహెచ్.రామ్చరణ్ మ్యాథమేటిక్స్ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించి ట్యాబ్ని మొదటి బహు మతిగా పొందాడు. అదేవిధంగా 9వ తరగతికి చెందిన ములుపోటి శ్రీవల్లి ఎంఎస్ క్యాల్ కులే టర్ని, 8వ తరగతికి చెందిన సుమేర్ సైంటిఫిక్ క్యాల్కు లేట ర్ని, 3వ తరగతికి చెందిన శ్రీవర్షిత్, 5వ తరగతికి చెం దిన రక్షిత జిమోట్రీ బాక్స్ని, 36మంది విద్యార్థులు మోడల్, మెం ట్ సర్టిఫికెట్స్ను సాధించారు. కార్యక్రమంలో విద్యా ర్థులను అభినందిస్తూ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసాచారి, డీన్ సైదయ్య, ఐఎన్టీఎస్ఓ ఇన్చార్జి మురళీకృష్ణ మా ట్లాడుతూ విద్యార్థులకు కాంపీటిటివ్ ఎగ్జామ్లో పాల్గొనడం ద్వారా వారి యొక్క విద్యా ప్రావీణ్యత మెరుగు పడుతుందన్నారు. బహుమతులు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.