Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండలంలోని చింతకుంట రామాయపల్లి, ఎలేటి రామయ్యపల్లి గ్రామాల్లో శుక్రవారం ఐసీడీఎస్ సూపర్ వైజర్ కవిత ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర ్వైజర్ కవిత మాట్లాడుతూ గర్భిణులు ఆరోగ్య విష యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్ప కుండా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూ చించా రు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు అంగన్వాడీలు అందించే సేవలను సద్విని యో గం చేసుకోవాలని ఆమె కోరారు. అదేవిధంగా ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని కోరారు . జడలపేట గ్రామంలో సూపర్వైజర్ సరోజ ఆధ్వర్యంలో పోషక అభయాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మధువంశీ కృష్ణ, కామిడి రత్నాకర్రెడ్డి, ఉపసర్పంచ్ పర్లపెల్లి స్వప్న, అంగన్వాడీ టీచర్లు మంజుల, కవిత రజిత, ఆశావర్కర్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
గణపురం :అంగన్వాడీ సెంటర్లలో బాలింత లకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని స ర్పంచ్ నారగాని దేవేందర్గౌడ్, ఉపసర్పంచ్ పోతర్ల అశోక్లు పేర్కొన్నారు. శుక్రవారం మం డల కేంద్రంలోని అంగడి బజార్లో ఉన్న అంగన్ వాడీ కేంద్రంలో 25మంది గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి, చిన్న పిల్లలకు అన్న ప్రసన్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్ వాడీ సెంట ర్లలో సెంటర్లను అంగన్వాడీ టీచర్లు అంకితభావంతో నిర్వహించి గర్భిణీలు, చంటి పిల్లలకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పిల్లల ఇందిర, తదితరులు పాల్గొన్నారు.