Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే దేశంలో, రా ష్ట్రంలో రైతు సంక్షేమం ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. మహబూబాబాద్ టికెట్ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎవరికి కేటాయించినా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. ములుగు నియోజకవర్గం నుండి సీతక్క నాయకత్వంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని పార్లమెంట్కు పంపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యంగా రైతులు, వ్యాపారులు, ప్రజల కష్టాలు తొలిగిపోయి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని జయరామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు కాంగ్రెస్ పార్టీని ఆదరించి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అందరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.