Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పస్రా కొండ్రెడ్డి చెన్నా రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ నెల 25న కార్య కర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహి స్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు మద్దినేని తేజరాజు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేస ిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చే యాలన్నారు. కార్యకర్తల్లో మరింత నూత నోత్సాం నింపడానికి ఈ సమా వేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలి పారు. కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజ యవంతం చేయాలని కోరారు. ఈ సమా వేశంలో నాయకులు కొంపెల్లి శ్రీని వాస్ రడ్డి, ధర్మ అంజిరెడ్డి, కణతల నాగేందర్, గాజుల శివ తదితరులు పాల్గొన్నారు.