Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య
నవతెలంగాణ-గోవిందరావుపేట
నీటిని పొదుపుగా వాడుకోవాలని వినియోగదా రుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని చల్వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నీటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ ప్రాణవాయువు తర్వాత అంత్యంత ప్రధా నమైన నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 90 శాతం నీరు సముద్రంలో కలుస్తుండగా కేవలం ఐదు శాతం మాత్రమే నీరు భూగర్భంలో ఇంకు తోందని, ఆ నీటినే మనం వినియోగిస్తు న్నామని తెలిపారు. భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నీటిని వృథా చేయకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. సదస్సులో ఇన్చార్జి ప్రధానో పాధ్యాయుడు కుమార స్వామి, వెంకటేష్, సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
వెంకటాపురం : నీరు వృథా చేయడం వల్ల ఏర్పడే అవాంతరాలను, నీరు ఆదా చేస్తే వచ్చే లాభాలను విజన్ స్కూల్ విద్యార్థ్దులు ప్లకార్డులతో ప్రదర్శించారు. 'జలసంరక్షణ ఎందుకు భూభాగంలో నీటి శాతం అంతా వ్యవసాయ రంగానికి నీరు' ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలపై అవగాహన కల్పించారు.