Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గట్టు మహేందర్
నవతెలంగాణ-ములుగు
ఈ నెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టన కార్యకర్తల సమావేశాన్ని వియవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు గట్టు మహేందర్ పిలు పునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యా లయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి మహేందర్ హా జరై మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25న సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ రాష్ట్ర గిరిజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అ జ్మీరా చందూలాల్ అధ్యక్షతన మధ్యాహ్నం జరిగే సమా వే శానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా ప్ర హ్లాద్లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. గట్టమ్మ దేవా లయం నుండి జిల్లా కేంద్రం వరకు ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, నా యకులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం సమావేశ స్థలిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఎ.సలీం, గొర్రె సమ్మయ్య, దొంతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సాగర్, కుమార్, నగేష్, పాపిరెడ్డి, రమేష్, సతీష్, సదయ్య తదితరులు పాల్గొన్నారు.