Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
గౌరారంవాగు ఎగువన కోమటిపల్లి ఆనకట్ట వద్ద నీటికి అడ్డుకట్టలు వేసి ఆపడం వల్ల మంగపేట, నర్సా పురంబోరు గ్రామపంచాయతీల ప్రజలకు తాగునీటి ఇ బ్బందులు కలుగుతున్నాయని మంగపేట మాజీ ఎంప ీటీసీ మంవడ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు తహశీల్దార్ బూక్యా హరిచంద్కు శుక్రవారం వినతి పత్రం అంది ంచారు. ఈ సందర్భంగా మండవ రామకృష్ణ విలేక రులతో మాట్లాడుతూ కోమటిపల్లికి చెందిన కొందరు రైతులు పోడు వ్యవసాయంలో రబీ వరి పంటలు వేసి గౌ రారం వాగునీటిని అక్రమంగా వరి పొలాలకు తరలించడం వల్ల వాగు ఎండిపోయి మంగపేట, నర్సాపురంబోరు గ్రా మాల ప్రజలు తీవ్రమైన తాగునీటి ఇబ్బందులు ఎదదు ర్కొంటున్నారని అన్నారు. తైబందీ లేని పోడు వ్యవసాయం చేసుకునే రైతులు నిత్యంపారే గౌరారం జలాలకు అడ్డుక ట్టలు వేసి నీటిని అక్రమంగా వాడుకుంటున్నారని ఫలి తంగా రెండు గ్రామాలలోని గ్రామపంచాయతీ బోర్లు, నివా సాల్లోని మోటార్లు భూగర్భ జలాలు అడుగంటి నీరు పో యడం లేదన్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిిర్యాదు చేసినా ఫలితంలేదని ఆరోపించారు. రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే గౌరారం సందర్శించి నీటి అడ్డుకట్టలు తొలగించి వాగునీరు పారేవిధంగా చర్యలు తీసుకోని రెండు గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్కు అందించారు. కార్యక్రమంలో రెండు గ్రామపంచాయతీల ప్రజలు నాయకులు పాల్గొన్నారు.