Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కార్పొరేషన్
అమృత్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన మెయిన్ పైపులైన్ అనుసంధాన పనులు చేపడుతున్న నేపథ్యంలో నేడు దేశాయిపేట ఫిల్టర్ బెడ్ సమీపంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని 7, 8, 22, 23, 19, 20, 25, 26, 28, 29వ డివిజన్లకు నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. నగర వాసులు సహకరించాలని కమిషనర్ కోరారు.