Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కురవి
భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత, కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చైర్మన్ సోమిశెట్టి శ్రీనివాస్, ఈఓ రాజేంద్రం, పూజారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఆమె వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, జెడ్పీటీసీ కొణతం కవిత, ఎంపీపీ బజ్జురి ఉమా, పిచ్చిరెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ ముండ్ల రమేష్, ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.