Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేయూక్యాంపస్
మదర్ ఫౌండేషన్ క్యాలెం డర్ను రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతరావు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోటె చిరంజీవి ఆధ్వర్యంలో 15ఏండ్లు గా సామాజిక సేవారం గంలో మదర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కవులు, కళాకారులు, .అధ్యాపకులు, జర్నలిస్టులు, వైద్యులు, రైతులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మోటె చిరంజీవి, గౌరవ సలహాదారులు ప్రొఫెసర్ గణపతి శర్మ, పవన్ కుమార్ పాల్గొన్నారు.