Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశానుసారం శుక్రవారం ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్ర శాంతంగా నిర్వహి ంచారు. మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల నిర్వహణ అదికారులు, సిబ్బంది పోలింగ్ బూత్ ఏర్పాటు చేయగా ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును ఉపయో గించుకున్నారు.మండలంలోని ఆయా గ్రామాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే 22 మంది ఉపాధ్యాయులకు ఓటు హక్కు కలిగి ఉండగా 21 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా పోలింగ్ బూతులో జరుగుతున్న ఎన్నికల నిర్వహణ తీరును స్థానిక తహసీల్దార్ అజ్మీర కొమి,ఏసిపి సుధీంద్ర పర్యవేక్షణలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించిన అనంతరం ఈవీఎం వి.వి ప్యాడ్లను జిల్లా కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.