Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
ఇటీవల నర్సంపేట వెంకటేశ్వర స్వామి గుడిలో వివాహం చేసు కుని వచ్చిన నూతన ప్రేమ జంటకు సంగెం పోలీసులు భరోసా ఇచ్చిన సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. మండ లంలోని ఎల్గూర్ రంగంపేట గ్రామానికి చెందిన కడారి గోపి 25 సంవత్సరాలు మున్నూరు కాపు కులస్తుడు, ఖాజీపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఆబోతు శారద 23 సంవత్సరాలు. వీరు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల వివాహం చేసుకొని సంగెం పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై యమ్ నాగరాజు ఇరువురి తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణ,కొమురయ్యలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో రంగంపేట కు చెందిన నాయ కులు,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.