Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని కొంకపాక గ్రామంలో శుక్రవారం ముదిరాజ్లు ఆందోళన చేపట్టారు. గ్రా మ ఊర చెరువు నీటిని విడుదల చేస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని చెరువు కట్టపై ఆందోళన చేశారు. దీంతో తహసిల్దార్ ఎస్కే. మహబూబ్ అలీ సందర్శించి ఆందోళన సద్దుమ ణిగించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ గ్రామంలోని రైతులకు పంటసాగుకు కావల్సిన నీటి నిల్వలను పరిశీలించారు. అనం తరం ముదిరాజ్లు తహసిల్దార్ను వేడు కున్నారు. ప్రభుత్వం ముదిరాజ్ల సంక్షేమం కోసం చేపట్టిన చేపల పెంపకంలో గతంలో చెరువులో వేసుకున్న చేప పిల్లలు రైతులు పంట పొలాలకు నీటిని వినియోగించుకున్నందున చేప పిల్లలు మరణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ల సంక్షేమం కోసం ఊర చెరువులో నీటిని ముదిరాజ్లకే పరిమితం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్లు సంగరబోయిన రవి, గోదారి అనిల్, అశోక్, యాకయ్య, దేవేందర్, ఎల్లస్వామి, అశోక్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.