Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోషకాహారంపై అవగాహన
- సూపర్వైజర్ల ఆధ్వర్యంలో..
నవతెలంగాణ-నడికుడ
పోషణ పక్షోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం నడికుడ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు సీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీ పీఓ స్వర్ణలత పాల్గొని మాట్లాడుతూ పోషక పక్షోత్సవాల్లో గర్భిణులకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు నెలతప్పినట్టుగా తెలియగానే సమీ పంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసు కోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే పోషక ఆహా ర పదార్థాలను పాలు, పండ్లు,గుడ్లు తీసుకోవాలన్నారు. అలాగే మండలంలోని సర్వాపూర్ గ్రామంలో గర్భిణులకు సీమంత కార్యక్రమాలను నిర్వహించగా గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత పాల్గొని మాట్లాడుతూ గర్భిణులు పోష కాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడ తారని అన్నారు.కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ధనలక్ష్మి,పద్మావతి, గ్రామ ఉప సర్పంచ్పి మీనుగు రాజు,కారోబార్ సతీష్, ఏఎన్ఎం సునీ త,అంగన్వాడీ టీచర్లు మీనుగు కల్ప న,ఆయాలు ఆశ వర్కర్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పరకాల :పోషణ పక్షోత్సవ కార్యక్ర మాల్లో భాగంగా ఐసీడీఎస్ పరకాల ప్రా జెక్టు పరిధిలోని రాజుపేట, టీఎం ఎస్, బీసీ కాలనీల్లో గర్భిణీలకు అంగన్వాడీ టీచర్ల ఆధ్వ ర్యంలో సీడీపీవో, సూప ర్వైజర్లు శ్రీమంతాలు నిర్వ హించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతాల సందర్భంగా స్వీట్లు, గాజులు, పసుపు కుం కుమలు అందజేశారు. అనంతరం వారు మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన పోషణ పక్షోత్సవాల్లో గర్భిణీలు, బాలిం తలకు పోషకాహారం గురించి అవగాహన కార్య క్రమాలు కల్పించాలని, కార్యక్రమంలో సూపర ్వైజర్ పద్మావతి, భాగ్యలక్ష్మీ, ధనలక్ష్మీతో పాటు అంగన్వాడీ టీచర్లు మ ల్లికాంబ, సునిత, కవిత, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి: మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రా మంలో అంగన్వాడి సెంటర్లో చిన్నా రుల కు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సత్యవతి, అంగన్ వాడి టీచర్లు శ్రీలత, జహీధబేగం, మంజుల,సుజాత, ప్రేమ లీల, స్రవంతి ఆశ వర్కర్స్ పారిజాతం, సువర్ణ ,ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
వాజేడు :బాలికలలో రక్తహీనత రాకుం డా మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ పేరూరు సెక్టార్ సూపర్ వైజర్ ఉమారాణి తెలిపారు. శుక్రవారం పేరూరు, ధర్మవరం, పెద్దగొల్లగూడెం, టేకులగూడెం, అయ్యవారిపేట, చండ్రుపట్ల, భువనపల్లిలోని అంగన ్వాడీ కేంద్రాల్లో పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణిలకు పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషకా హారం, రక్తహీనత గురించి వివరించారు. వారికి వ్యాసర చనలు, ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో అంగన్వాడీలు చిలకమ్మ, రమాదేవి, మల్లీశ్వరి, స్వరూప, సమ్మక్క, విజయనిర్మిల, పార్వవతి, సుజాత, శివరాజ్యం తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల వ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల్లో శుక్రవారం పోషణ్ అభియాన్ కార్య క్రమాలు విస్తృతంగా నిర్వహించారు. అనంతరం గర్భి ణులు, చిన్నారులకు రక్త పరీక్షలు నిర్వహించి హిమో గ్లోబిన్ మాత్రలు అందించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, అంగన్వాడీ టీచర్లు చింత దీప, రుక్మిణి, పద్మరాణి, జీ.సుమతిరాణి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.