Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
మండలంలోని ఆజంనగర్ గ్రామ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు వెంటనే ఇవ్వాలని శుక్రవారం బీజేపీ జిల్లా మీడ ియా సెల్ ఇన్చార్జి రవికుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని ఆజంనగర్ గ్రామంలో గత 12రోజులుగా బీజేపీ జిల్లా ప్రచార కార్యదర్శి బొమ్మన లవణ్కుమార్ ఆధ్వ ర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్షలకు శుక్రవారం సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరుతో వచ్చే నగదు పట్టాదారు పాసు పుస్తకాలు లేనందున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మన్ పథకం కూడా వర్తించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు ఎన్నిసార్లు ఆర్జీలు పెట్టుకున్నా రెవెన్యూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆజంనగర్ గ్రామంతో పాటు మండలంలోని అర్హత కలిగిన అన్ని గ్రామాల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కొండి గట్టయ్య, వెంకన్న, సరోజన, ఓదెలు, సతీష్, సమ్మిరెడ్డి, భూమయ్య, కటకం ఓదెలు, కటకం నీలయ్య, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.