Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజ్డమ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు జల సంరక్షణకై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎస్డీ జావెద్ జల సంరక్షణ ఆవశ్యకతపై విద్యార్థులకు ఉద్భోదించారు. 75శాతం సముద్రాల ద్వారా, 25శాతం చెరువులు, నదులు, కుంటలు వంటి వనరుల ద్వారా నీటి లభ్యమవుతుందని అన్నారు. పొదుపుగా నీటిని వాడుకుంటేనే సకల జీవరాశి మనుగడ సాధ్యపడుతుందని అన్నారు. సమాజంలోని ప్రతీ ఒక్కరూ నీటిని వృథా చేయకుండా బాధ్యతగా నీటి సంరక్షణ తమ వంతుగా స్వీకరించాలని అన్నారు. విద్యార్థులు నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం నింపి కరువు రహిత దేశ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎస్డీ.జహంగీర్, ఇన్చార్జీలు ప్రకాశ్, రహీమ్, ఉపాధ్యాయులు వీరభద్రయ్య, రాజు, రాజేశ్, ఇలియాస్, సుకన్య, రోహిణి, అరుణ, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.