Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించినందుకు గ్రూపు నుంచి తొలగింపు
నవతెలంగాణ-మంగపేట
గ్రూపులో సభ్యురాలిగా ఉండి చనిపోయిన మహిళ సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి రూ.2.75 లక్షలు లింకేజీ రుణం తీసుకున్నారని సాయికృష్ణ మహిళా పొదుపు సంఘం సభ్యురాలు నలమాలపు ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపురం బోరు గ్రామానికి చెందిన 10 మంది మహిళలు సాయికృష్ణా మహిళా పొదుపు సంఘం పేరుతో 22 ఏండ్లుగా గ్రూపు నడిపిస్తున్నారు. ఆ గ్రూపునకు 20 ఏండ్లుగా అధ్యక్షురాలుగా ఉన్న ఇందిర భర్త నలమాలపు వెంకట్రెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో గ్రూపు అధ్యక్ష భాద్యతల నుంచి తొలగినట్లు తెలిపారు. ఈ క్రమంలో గ్రూపు నిర్వాహణ బాధ్యతలు గ్రూపు సభ్యులు మరో మహిళకు అప్పగించడంతో ఇందిర సభ్యురాలుగా కొనసాగుతుంది. భర్త అనారోగ్యంతో గ్రూపు విషయాలు పట్టించుకోకపోవడంతో సదరు గ్రూపు మహిళలు బ్యాంకు (క్యాష్ క్రెడిట్ లోన్) సీసీఎల్లో రుణం పొందేందుకు గ్రూపులో చనిపోయిన మహిళది, తనది ఫోర్జరీ సంతకాలు పెట్టి రుణం పొందారు. ఇదేమిటని ప్రశ్నించిన తనను తొమ్మిది మంది మహిళల గ్రూపు సభ్యులు తీర్మాణం చేసి తొలగించారని వాపోయింది. ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు లింకేజీ రుణం తీసుకునేందుకు సహాకరించిన ఐకేపీ, బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇందిర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.