Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-భూపాలపల్లి
ఆన్లైన్ ర్యాండమైజేషన్ ద్వారా జిల్లాలో గల ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. లోక్సభ ఎన్నికలలో ఉపయోగించేందుకు వీలుగా భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ మినీ స్టేడియంలోని స్ట్రాంగ్రూంలో భద్రపర్చిన 977 బ్యాలెన్సింగ్ యూనిట్లు, 724కంట్రోల్ యూనిట్లు, 783 వీవీప్యాట్ యంత్రాలకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి విడత ఆన్లైన్ ర్యాండమైజేషన్ నిర్వహించారు. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి 500బ్యాలెన్సింగ్ యూనిట్లు, 371కంట్రోలింగ్ యూనిట్లు, 401 వీవీప్యాట్ యంత్రాలను, ములుగు జిల్లాలోని ములుగు శాసనసభ నియోజకవర్గానికి 477బ్యాలెన్సింగ్ యూనిట్లు, 353కంట్రోలింగ్ యూనిట్లు, 382వీవీప్యాట్ యంత్రాలను వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాండ మైజేషన్ ద్వారా భూపాలపలి, ములుగు శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించిన వీవీప్యాట్, ఈవీఎలంను రాజకీయ పార్టీల సమక్షంలో వేరు చేసి ములుగుకు కేటాయించిన వాటిని మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల సందర్భంగా ములుగు శాసనసభ ఎన్నికలలో ఉపయోగించడానికి ములుగుకు పంపించాలని, వరంగల్ లోక్సభ ఎన్నికలలో భూపాలపల్లి శాసనసభ ఎన్నికలలో ఉపయోగించడానికి, భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ మినీ స్టేడియంలో భద్రపర్చాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ స్వర్ణలత, ఆర్డీఓ వెంకటాచారి, ములుగు ఆర్డీఓ రమాదేవి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మహేష్బాబు, ఎలక్షన్ డీటీ నరేష్, ఈడీఎం శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వెంకటనారాయణ, సీపీఐ(ఎం) ప్రతినిధి బొట్ల చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.