Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాజేడు
మావోయిస్టు సానుభూతిపరుడిని అరెస్టు చేసినట్లు పేరూరు ఎస్సై ఆర్ స్వామి తెలిపారు. పోలీసుస్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని పేరూరు పోలీసుస్టేషన్ పరిధిలోని క్రిష్ణాపురం శివారులోని అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రభుత్వ నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీ గంగలూరు ఏరియా కమిటీకి చెందిన ఎల్ఓఎస్ మావోయిస్టు దళ సభ్యుడు, బీజాపూర్ జిల్లా ఎంకేరి గ్రామానికి చెందిన కుర్సం మున్నా(29) పట్టుబడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని పలు సంఘటనల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. మున్నాపై ఆరు వారెంట్లు ఉన్నాయని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి తహశీల్దార్ రమాదేవి ఎదుట హాజరు పర్చినట్లు ఎస్సై తెలిపారు.