Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలింగ్ కేంద్రాల్లో సీపీ రవీందర్ పరిశీలన
నవతెలంగాణ-హన్మకొండ
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా నిర్వహిం చారు. నగరంలో కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఉపాధ్యాయులు స్వచ్ఛం దంగా ఓట్లను వినియోగించుకునేందుకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాజీపేట, సుబేదారిలోని లా కళాశాల, కేడీసీ కళాశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఉపాధ్యాయులు ఓట్లను వినియోగించుకునేందుకు అన్ని సౌకర్యాలను కల్పించారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రధాన రోడ్లపై పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసుకుని ఓట్లు వేసే ఉపాధ్యాయుల ఓటర్లకు పోల్ చిట్టీల పంపిణీ కొనసాగించారు. ఇదే అదనుగా భావించి తమ అభ్యర్థులను గెలిపిం చాలని ఓటర్లను ప్రాధేయపడడం కనిపించింది. బరిలో నిలిచిన అభ్యర్థులు పూల రవీందర్, మల్లిశ్వర్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, చంద్రమోహన్లు పోలింగ్ జరిగే తీరును పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ సీపీ డాక్టర్ విశ్వనాధ రవీందర్, డీసీపీలు, ఏసీపీలు ఆయా పోలింగ్ కేంద్రాల్లోని సమీప సీఐలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు. లా కళాశాల, కేడీసీ పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉపాధ్యాయులు సంఘాల వారిగా ప్రచారం చేస్తూ గుంపులుగా ఉండడంతో పోలీసులు జోక్యం చేసుకుని దూరంగా పంపించారు. 75.63 శాతం ఓట్లు నమోద య్యాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.