Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా కమిషనర్ ఎన్ రవికిరణ్
నవతెలంగాణ-కార్పొరేషన్
నగరంలో పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలని బల్దియా కమిషనర్ ఎన్ రవికరణ్ అన్నారు. నగరంలో కమిషనర్ ఆకస్మీకంగా పర్యటించి పారిశుధ్యాన్ని తనిఖీ చేశారు. తెల్లవారు జామున అశోకా, అమృత కూడళ్లు, గోపాలస్వామి గుడి సమీపంలో పారిశుధ్య సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. రోడ్లకిరువైపుల ప్లాస్టిక్ కవర్లు, రాళ్లు రప్పలు, చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. ప్రదాన రహదారి కీరువైపుల వున్న వాణిజ్య దూకాణాలు, వీధి వ్యాపారం చేసే వారు ప్రతి ఒక్కరూ చెత్త బుట్టను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్, చెత్తను అందు లోనే వేయాలని, చెత్తను సేకరించే సమయం వారికి తెలిపి, ఆ సమయా నుసారం చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టా లన్నారు. సానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యత తీసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. సానిటరీ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్, చెత్త రోడ్లపై వేస్తున్న దుకాణాలకు పెనాల్టీలు విధించాలని అన్నారు. కమిషనర్ బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద గల పబ్లిక్ టాయిలెట్లను తనిఖీ చేశారు. పబ్లిక్ టాయిలెట్లు ఉదయం 5.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు తెరచి వుండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. పబ్లిక్ టాయిలెట్ల వద్ద కేర్ టేకర్ పేరు, మొబైల్ నెంబరు ప్రదర్శించాలని అన్నారు. ప్రధాన కార్యాలయం వద్ద గల పబ్లిక్ టాయిలేట్ మూసి వుండడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ ఫ్లాట్లలో చెత్తాచెదారం, మురుగునీరు నిల్వవున్నచో సదరు యజమానికి నోటీసులు జారీ చేయాలని, స్పందించనిచో, చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ ఇండోర్ స్టేడియం వద్ద పారిశుధ్య వాహనాల గమనాన్ని పరిశీలించారు. పారిశుధ్య వాహనాలన్నీ ఉదయం 5.00 గంటలకు బయలుదేరాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 5.30 గంటలకల్లా క్షేత్రస్థాయిలో వుండాలని అన్నారు. వాహనాలకు మరమ్మతులుంటే, ఇంజనీరింగ్ విభాగంతో సమన్వయం చేస్కుఉని మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం రాంపూర్లోని డంపింగ్ యార్డ్ను తనిఖీ చేశారు. వేయింగ్ యంత్రం, బోర్ వెల్ పని చేయక పోవడాన్ని కమిషనర్ గమనించి వెంటనే మరమ్మతు చేయాలని సూచించారు. వాహనాల నుంచి చెత్త కింద పడిపోకుండా చూడాలని సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు చర్యలు తీసుకోవాలన్నారు. డంప్ యార్డ్ కుడి పక్కన గల స్థలాన్ని శుభ్రం చేసి మొరం పోయాలని, ప్రాపెసింగ్ యూనిట్ కోసం సిద్ధం చేయాలన్నారు. ఉద్యానవనాధికారులను సమన్వయం చేసుకుని డంప్ యార్డ్ వద్ద గార్డెనింగ్ అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా ఆరోగ్యాధికారి డాక్టర్ బి రాజారెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ జి రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.