Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని తిర్మలగిరి శివారు పాండవుల గుట్టల్లో శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాక్ క్లైంబింగ్ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రెఫెలింగ్, రాక్ క్లైంబింగ్ విన్యాసాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా అనుబంధ ఎస్ఎన్ వనిత మహా విద్యా కళాశాల నుంచి 40మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గుట్టల్లోపై గల పెయింటింగ్స్ చూసి విద్యార్థులు ముగ్ధులయ్యారు. ఈ విన్యాసాల్లో జిల్లా కో-ఆర్డినేటర్ కళ్యాణపు సుమన్ వివరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎఫ్డీఓ సారయ్య, చెల్పూర్ ఎఫ్ఆర్ఓ పూర్ణిమ, సెక్షన్ అధికారి ప్రసాదరావు, బీట్ అధికారి ఫయాజ్, భాస్కర్, శ్రీకాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.