Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ కవి అన్వర్
నవతెలంగాణ-హన్మకొండ
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేఖంగా పోరాడిన అసువలు బాసిన భగత్సింగ్ ఆశయాలను యువత కొనసాగించాలని ప్రముఖ కవి, రచయిత అన్వర్ అన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సమీపంలోని బాప్టిస్టు కాంప్లెక్స్ ఏ టూ జెడ్ మెడికల్ షాప్ పక్కన నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్లో మాక్సింగ్ గోర్కి కథలు, మికైల్ సులకు కథలు, సినారే కవిత్వం పుస్తకాలను శుక్రవారం ఆయన ఆవిష్క రించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పుస్తకాలు చదివితేనే మేథావులు అవుతారని అన్వర్ అన్నారు. భారతదేశంలో స్వపరిపాలన సాగిస్తున్నప్పటికీ భగత్ సింగ్ ఆశయాలు నెరవేరలేదనిచరిత్ర ఉపాన్యాసకులు మురళీ తెలిపారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ బండారి బాబు మాట్లాడారు. పుస్తకాలు చదవడం ద్వారా సంస్కృతి సాంప్రదాయాలపై యువతకు అవగాహన పెరుగుతుందన్నారు. మార్కెట్లో లభించే పుస్తకాలను నేటి తరం యువత చదవడాన్ని అలవర్చుకోవాలని ప్రముఖ కవి డాక్టర్ తక్కళ్లపెల్లి బాల్రాజు సూచించారు. నవతె లంగాణ పబ్లిషింగ్ బుక్ హౌజ్లో వారం రోజుల పాటు పుస్తక ప్రదర్శన ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయో గించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాహితీ ప్రియులు శ్రీనివాస్, నారాయణ, ప్రభాకర్, సునిల్, సదానందం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.