Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రోణాచార్య అవార్డు గ్రహీత, నేషనల్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్
- ఇంటర్ క్రీడాపోటీలు ప్రారంభం అ విజేతలకు బహుమతులు అందజేత
నవతెలంగాణ-కాజీపేట
క్రీడలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ద్రోణాచార్య అవార్డు గ్రహిత, నేషనల్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. జాతీయ సాంకేతిక విద్యాలయం నిట్ వరంగల్లో ఇంటర్ ఎన్ఐటీ అథ్లెటిక్ క్రీడలను మూడు రోజులపాటు నిర్వహిస్తుండగా శుక్రవారం ఘనంగా ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, నేషనల్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్, నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణరావు క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నాగపురి రమేష్ మాట్లాడారు. క్రీడలు ప్రతి ఒక్కరిలో ఒక చాంపియన్ గా ఎదగాలని కోరికను కలిగిస్తుందని క్రీడలు పట్టుదలతో ఆడితే తమకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తాయని తెలిపారు. క్రీడాకారులు రూల్స్ అండ్ రెగ్యూలేషన్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తెలం గాణ ప్రత్యేక చరిత్ర కలిగి ఉందన్నారు. అనం తరం నీట్ డైరెక్టర్ ఎన్వీ రమణరావు మాట్లాడారు. చదువులోనే కాకుండా క్రీడా రంగంలో కూడా విద్యార్థులు ఎదగాలన్నారు. మానసి కంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండ టానికి క్రీడలు దోహద పడుతా యన్నారు. మొదటి రోజు ఉత్తమ ప్రతిభ నకబర్చిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.
గెలుపోటమలు సహజం : స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మధుసూదన్
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుసూదన్ అన్నారు. నిట్లో నిర్వహిస్తున్న అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 500 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండటం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.