Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23 నుంచి కర్ణాటకలో...
- సొసైటీ చైర్మన్ డాక్టర్ విజరుచందర్రెడ్డి
నవతెలంగాణ-హన్మకొండ
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కర్ణాటక శాఖ ఆధ్వర్యంలో ఈనెల మార్చి 23 నుంచి 27వ వరకు బళ్లారి జిల్లాలోని హంపిలో నిర్వహించనున్న జాతీయ యూత్ రెడ్ క్రాస్ శిబిరానికి జిల్లా నుంచి ముగ్గురు యూత్ రెడ్క్రాస్ వాలంటీర్లు ఎంపికయ్యారని సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ పెసరు విజరుచందర్రెడ్డి తెలిపారు. శిబిరానికి ఎంపికైన వాలంటీర్లకు సుబేదారిలోని కార్యాలయంలో శుక్రవారం ఐడీ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జాతీయ శిబిరానికి రాష్ట్రం నుంచి మొత్తం 10 మంది ఎంపికగా జిల్లా నుంచి ముగ్గురు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. రాష్ట్ర యూత్ రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్ రమణ అధ్వర్యంలో ముగ్గురూ బయల్దేరి వెళ్తారని చెప్పారు. వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ కీర్తిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. వాలంటీర్లు చైతన్య, సాత్విక, దుర్గాప్రసాద్ రాణించాలని సూచించారు. అనంతరం సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాస్రావు, కోశాధికారి నాగయ్య, జిల్లా పాలకవర్గ సభ్యులు బొమ్మినేని పాపిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.