Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశాంతంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు
- అర్బన్ జిల్లాలో సీపీ రవీందర్ పర్యవేక్షణ
నవతెలంగాణ-వరంగల్
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 89.25 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లాలో పోలీస్ కమిషనర్ (సీపీ) రవీందర్ ఎన్నికలను పర్యవేక్షించారు. అలాగే ఇతర అధికారులూ పరిశీలించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వరంగల్ అర్బన్ జిల్లాలో 88.95, వరంగల్ రూరల్లో 86.63, జనగామ జిల్లాలో 90.06, జయశంకర్ భూపాలపల్లిలో 89.95, మహబూబాబాద్లో 88.04, ములుగులో 89.22 శాతం ఓట్లు
89.25 శాతం పోలింగ్పోలయ్యాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 20 వేల 888 ఓట్లుండగా 18 వేల 886 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 92.65, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83.95 శాతం ఓట్లు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 10 గంటల వరకు 21.89, మధ్యాహ్నం 12 గంటల వరకు 57.87 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు 77.36, సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 89.25 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.