Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ వి రవీందర్
నవతెలంగాణ-వరంగల్ ప్రతినిధి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, విద్యార్థునులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పని చేసే షీ టీంతో కలిసి ఆకతాయిల భరతం పట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ మహిళలు, విద్యార్థినులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న షీ టీం విభాగాలపై యువతులు, విద్యాార్థినులకు అవగాహన కల్పించడం కోసం నూతనంగా రూపొందించిన వాల్పోస్టర్లను ఆదివారం సీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షీటీం విభాగంపై మహిళలకు మరింత అవగాహన కల్పించడం కోసం నూతనంగా రూపొందించబడిన వాల్పోస్టర్లను నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్లు, సినిమాథియేటర్లు, కాలేజీలతో పాటు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీంతో షీటీం విభాగాలతో మహిళా కళాశాలల్లోనూ ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మహిళల భద్రత కోసం ఏర్పాటైన ఈ విభాగం అధికారులు, సిబ్బంది అన్ని ప్రదేశాల్లో నిఘా కొనసాగిస్తారని, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు, ఈవ్టీజింగ్ చర్యలకు పాల్పడితే తక్షణమే కమిషనరేట్ వాట్సప్ నెంబర్ 9491089257లేదా 100కు సమాచారం అందించాలని సూచించారు.