Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈ నెల 17నుంచి 20వరకు కరీంనగర్లో జరిగిన వాకో ఇండియా నేషనల్ కాడెట్స్ అండ్ జూనియర్స్ కిక్బాక్సింగ్ ఛాంపియన్షిప్-2019 జాతీయస్థాయి కిక్బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జయశంకర్ జిల్లా భూపాలపల్లి పట్టణానికి చెందిన షావలిన్ డ్రాగన్ కుంగ్-ఫూ అకాడమీ విద్యార్థులు పాల్గొని బంగారు పతకాలు సాధించినట్టు కిక్బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు మాస్టర్ మాదాసి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్-9 కాడెట్స్ బాలుర సాప్ట్ వెపన్ కేటగిరీలో బొప్ప సౌశిక్ బంగారు పతకం, భాను మైత్రేయ వెండి పతకం, అండర్-9 కాడెట్స్ బాలుర సాప్ట్ స్టైల్ విభాగంలో రాయపురి జాన్లింకన్ బంగారు పతకం, అండర్-9 సాప్ట్ స్టైల్ ఫామ్ విభాగంలో పర్షవేని తనన్వి వెండి పతకం, మాన్వి తన్మయి కాంస్య పతకం, అండర్-9 సాప్ట్ స్టైల్ వెపన్ ఫామ్ విభాగంలో పర్షవేని అనన్య బంగారు పతకం, శాన్వి తన్మయి వెండి పతకం, అండర్-15 ఓపెన్ కేటగిరీ బాలికల సాప్ట్ వెపన్ కేటగిరీలో మేకల కరుణ వెండి పతకం, అండర్-10 38కేజీ విభాగంలో పాయింట్ పైట్ కేటగిరీలో బంటుపల్లి షాహిత్ కాంస్య పతకం, అండర్-12 28కేజీ విభాగంలో పాయింట్ పైట కేటగిరీలో తంగెళ్లపల్లి ఆంజనేయులు కాంస్య పతకం, అండర్-15 ఓపెన్ కేటగిరీ 42కేజీ బాలికల లైట్ కాంటాక్ట్ కేటగిరీలో మేకల కరుణ కాంస్య పతకాలు సాధించి నట్టు ఆయన పేర్కొన్నారు. వీరిని తెలంగాణ రాష్ట్ర కిక్బాక్సింగ్ అధ్యక్షుడు రామాంజ నేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్, టోర్నమెంట్ ఆర్గనైజర్ ప్రసన్నను అభినందించినట్టు ఆయన తెలిపారు.