Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
ప్రకృతి అందాలకు నిలయమైన పాకాలను వీక్షించడానికి ఆదివారం భారీ సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది. సరస్సు మత్తడికి చేరువలో నీరు చేరడంతో పాకాల నిండుకుండలా కన్పిస్తూ సరస్సు మధ్యలో చిలుకగట్టు పాకాల అందాలను రెట్టింపు చేస్తొంది. పాకాల ఆయకట్టు కింద పంట సాగు పనులు పూర్తి చేసుకున్న రైతులు, వ్యవసాయ కూలీలు, సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పాకాలలో విహరించారు. పంటలు బాగా పండాలని, కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలంటూ కట్టమైసమ్మ గుడి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. రోజంతా పాకాల కట్ట పొడవునా, మత్తడి వద్ద, చిల్డ్రన్స్ పార్కులో కాలక్షేపం చేస్తూ విందులు వినోదాలతో ఉల్లాసంగా గడిపారు. పాకాల సరస్సులో పర్యాటకులు బోటు విహరం చేస్తూ పాకాల ప్రకృతి అందాలను వీక్షించారు.