Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపాల్పూర్ గ్రామానికి చెందిన పోగుల రణధీర్(14) ఆదివారం సెలవుదినం కావడంతో తోటి విద్యార్థులతో కలిసి గ్రామ శివారు బాలాజీ స్టోన్ క్రషర్ వద్ద నీటి గుంటలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే లోపే మృతిచెందాడు. విద్యార్థి తండ్రి కృపాకర్ గతంలోనే చనిపోయాడు. ఆయన తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గడ్డం ఉమ తెలిపారు.