Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అణగారిన వర్గాలకు 14 మంత్రి పదవులు దక్కేదాకా పోరాటం ఆగదు
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
నవతెలంగాణ-వరంగల్
ఎస్సీల్లో మంత్రి అయ్యే అర్హత ఎవరికీ లేదా.. అని సీఎం కేసీఆర్ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో మాదిగ ఉప కులాల 'మహా దీక్ష'లో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఎమ్మెల్యేలు వారి ఆవేదనను అణుచుకొని సీఎం కేసీఆర్ స్క్రిప్ట్
ఎస్సీల్లో మంత్రయ్యే అర్హత ఒక్కరికీ లేదా ?
చదువుతున్నారన్నారు. అగ్రకులాలకు రెండు మంత్రి పదవులు మాత్రమే దక్కుతాయని, అణగారిన వర్గాలకు 14 మంత్రి పదవులు దక్కాలని, అంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎస్సీలకు మంత్రి పదవి ఇవ్వనందుకు కేబినెట్ను రద్దు చేయాలన్నారు. రావులకు 4 మంత్రి పదవులు, రెడ్డిలకు 6 మంత్రి పదవులు ఇచ్చారన్నారు. కడియం శ్రీహరికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అవినీతి పేరు చెప్పి రాజన్నను బర్తరఫ్ చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఉన్నా మళ్లీ హరీశ్రావుకు ఎలా మంత్రి పదవి ఇచ్చారని ప్రశ్నించారు. రెండుసార్లు లక్ష ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్ అందరూ మంత్రి పదవులకు అర్హులేనన్నారు. కొప్పుల ఈశ్వర్కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 5గురు ఉపముఖ్యమంత్రులను అన్ని వర్గాలకు న్యాయం చేశారని, ఇది తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాదా అని ప్రశ్నించారు. సబ్బండ వర్గాలు కొట్లాడితే వచ్చిన తెలంగాణ కొందరు చెంచాల చేతిలో బందీగా మారిందన్నారు. నాడు పార్లమెంటు, అసెంబ్లీలోనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎస్సీలు ఉండాలని అంబేద్కర్ కొట్లాడి రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు.
కేసీఆర్కు తొత్తులుగా మారితే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే : పొన్నం
కేసీఆర్కు దళిత ఎమ్మెల్యేలు తొత్తులుగా మారితే కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎస్సీలకు మంత్రి పదవి ఇచ్చేవరకు పోరాటాలు చేయాలన్నారు. నాడు రజాకార్లతో పోరాటం చేసిన ప్రజలు నేడు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.
రేపటి ఉద్యమానికి ప్రతీకలు : ఏఐసీసీ సెక్రటరీ సంపత్కుమార్
భారీ వర్షంలో నిరసన తెలిపిన అందరూ రేపటి ఉద్యమానికి ప్రతీకలని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకు మందకృష్ణ ఆధ్వర్యంలో చరమగీతం పాడాలన్నారు. ఎస్సీలను అణిచివేస్తే కాలగర్భంలో కలిసిపోక తప్పదన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ను ప్రశ్నించినందుకు తనను అసెంబ్లీ నుండి గెంటేశాడని, మళ్లీ తాను అసెంబ్లీలో అడుగుపెట్టే నాటికి అసెంబ్లీలో కేసీఆర్ వుండడన్నారు. ఎస్సీల మహాదీక్షకు కాంగ్రెస్, బీజేపీ, సీపీిఐ నేతలు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ తరుపున పొన్నం ప్రభాకర్, సంపత్కుమార్, నాయిని రాజేందర్రెడ్డి, బీజేపీ తరుపున మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు, ఎడ్ల అశోక్రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొన్నారు.