Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
దేశంలో అశాస్త్రీయ భావాజాలం రోజు రోజుకూ పెరుగిపోతోందని, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు పాటుపడాలని జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య అన్నారు. జనవిజ్ఞాన వేదిక వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ 3వ వార్షికోత్సవ సభ ప్రొఫెసర్ ఆంజనేయులు అధ్యక్షతన సేయింట్ పీటర్స్ విద్యా కళాశాలలో ఆదివారం
శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి : జేవీవీ
నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వారు హాజరయ్యారు. 'అంతర్జాతీయ పీరియాడిక్ టేబుల్ ఆవశ్యకత-సామాజిక అనువర్తనం'పై ప్రొఫెసర్ కె లక్ష్మారెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యా దశ నుంచే ప్రశ్నించే తత్వం, సైన్స్ పద్ధతిలో జీవించేలా కృషి చేయాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు దాటినా 70 శాతం అక్షరాస్యత సాధించకపోవడం భాధాకరమ న్నారు. విద్యార్థులు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని భవిష్యత్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కారద్యదర్శి కరుణాకర్, కోశాధికారి ఉమా మహేశ్వర్రావు, ఉపాధ్యక్షులు డాక్టర్ రాములు, జి భద్రయ్య, నాయకులు వేణు, సుమలత, సునిత, మొగిలి, అజరు, కుమారస్వామి, భిక్షపతి, సెయింట్ పీటర్స్ విద్యాసంస్థల అధినేత నారాయణరెడ్డి పాల్గొన్నారు.