Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హారితహారం కార్య క్రమంలో గ్రామపంచాయతీలకే అధిక ప్రధాన్య తనిస్తోంది. గతంలో ఉపాధిహామీ, అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలను నిర్వహించేవారు. నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకొచ్చిన తరువాత నర్సరీల బాధ్యత మొత్తం గ్రామపంచాయతీలకే అప్పగించారు. ఉపాధిహామీ చట్టం ద్వారా గ్రామపంచాయతీల ద్వారానే హరితహారం నర్సరీల నిర్వహణ కొనసాగిస్తున్నారు. గతంలో ఉపాధిహామీ ఆధ్వర్యంలో 60శాతం, అటవీశాఖ ఆధ్వర్యంలో 40శాతం నర్సరీల నిర్వహణ జరిగేది. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్నారు. గత ఐదు విడుతల్లో నర్సరీల్లో పెంచిన మొక్కలు సగానికన్న ఎక్కువ మొక్కలు నర్సరీల లోన్లే వనాలుగా మారిన పరిస్థితి. నాటిన మొక్క లు కూడా 50శాతం కూడా కాపాడలేక పోయా రు. ప్రస్తుతం ఆరో విడతలోనైనా ప్రభుత్వం సూ చించిన లక్ష్యానికి చేరువయ్యేనా అనే అనువమా నాలు వ్యక్తవవుతున్నాయి. ఇందుకు మల్హర్రరావు మండలమే నిదర్శనం.
మండలవ్యాప్తంగా ఆరో విడత హరితహారం నిమిత్తం 15 గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో మొత్తం 15 నర్సరీలు ఏర్పాటు చేశారు. óలక్షా3వేల మొక్కలు పెంచే లక్ష్యం పెట్టుకున్నారు. చిన్న పంచాయతీల్లో 6వేలు, పెద్ద పంచాయతీల్లో పది వేల మొక్కల వరకు పేంచేందుకు సన్నద్ధ్దమవుతు న్నారు. రుద్రారం గ్రామ నర్సరిలో 2లక్షలు, మల్లా రం గ్రామ నర్సరిలో లక్ష మొక్కలు పెంచడానికి సన్నహాలు చేస్తున్నారు. ఉపాదిహామీ, అటవీశాఖ ఆధ్వర్యంలో మొత్తం 4లక్షల3వేల మొక్కలు నాటేందుకు అధికారులు, పంచాయతీల పాలక వర్గం సిద్ధమైంది. కాగా ఐదో విడత హరిత హారంలో 6లక్షల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకు న్నారు. ఇందులో 40శాతం మొక్కలు నర్సరీల్లోనే వృథాగా మిగిలిపోయాయి. 4 లక్షలు మొక్కలు నాటగా సుమారు లక్ష మొక్కలు మాత్రమే బతికా యి. మిగతావి పరరక్షణకు నోచుకోక ఎండిపో యిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆరోవిడత లక్ష్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. గ్రామ భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండానే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40వేల మొక్కల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ధేశిం చింది. ప్రస్తుతం మొక్కలు పెంచే విషయాన్ని పక్కన పెడితే వాటిని ఎక్కుడ నాటించాలనే విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నర్సరీల ద్వారా మొక్కలను పెంచడానికి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, పంచా యతీ కార్యదర్సి ఇతర సిబ్బంది ఏర్పాట్లు చేస్తు న్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్లలో మట్టిని నిం పడం, మొక్కలకు సంబంధించిన విత్తనాలు వేసి నీటిని పట్టించే కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్తోపాటు నీటి ట్యాం కర్ను కొనుగోలు చేస్తున్నారు. అయినా హరిత హారం లక్ష్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
నిర్వాహణలో నిర్లక్ష్యం వద్దు : ఏపీఓ హరీష్
ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీల నిర్వా హణకు ప్రాధాన్యతనిచ్చాం. ఏ పంచాయతీ పరిధిలో నాటాల్సిన మొక్కలను ఆపంచాయ తీల్లోని నర్సరీల్లోనే పెంచుతున్నారు. నర్సరీల నిర్వాహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటాం.