Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైర్డ్ ఈఎన్సీ జంబుల్రెడ్డి
- నగరంలోని ఫిల్టర్ బెడ్ల పరిశీలన
నవతెలంగాణ-వరంగల్
క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా నీటి లీకేజీలను అరికట్టొచ్చని రిటైర్డ్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ జంబుల్రెడ్డి అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఇంజి నీరింగ్ సిబ్బందికి నీటి నిర్వహణ, నీటి సరఫరా తీరుపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమం చేప ట్టారు. ఇందులో భాగంగా నగరంలోని చిన్న వడ్డే పల్లి, కాకతీయ, దేశాయిపేట్ ఫిల్టర్బెడ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎస్ఈ ఫిల్టర్బెడ్ల నిర్వహణ తీరు, క్లోరినేషన్ విధానాలతో పాటు నగరానికి గల నీటి వనరులు, సరఫరా అయ్యే పద్ధతులు మ్యాప్ ద్వారా వివరిం చారు. అనంతరం కుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో నీటి సమస్యలను గుర్తించాలన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే క్రమంలో వినూత్నంగా ఆలోచించాలన్నారు. నగరానికి ధర్మసాగర్, వడ్డేపల్లి, భద్రకాళి ట్యాంక్లు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయన్నారు. నీటి సరఫరా విధానాలను అధ్యయనం చేయాలని అన్నారు. నీటి లీకేజీల గురించి సమగ్ర సమాచారం తెలి యాలంటే ప్రతినెలా 2-3 పర్యాయాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. హైదరాబాద్ తర్వాత అతి వేగంగా విస్తరిస్తున్న నగరం వరంగల్ అన్నారు. వివిధ రకాల నీటి వనరులు 58 ఉన్నాయన్నారు. ప్రస్తుతం రోజు వారీ నగర నీటి సరఫరా సామర్ధ్యం 40 ఎంజీ అన్నారు. రాబోయే పదేండ్లలో ఇది పెరుగుతుందని, ఎక్కడైనా పైపులైన్లు బలహీనం గా ఉంటే వాటి స్థానంలో కొత్త పైపులైన్ లను ఏర్పాటు చేయా లన్నారు. హెచ్ఆర్డీ ప్రతినిధి విజరుకుమార్ మాట్లాడుతూ... నీటి సరఫరా ద్వారా అందించే నీటి నాణ్యత అతి ముఖ్యం అన్కానరు. హైదరా బాద్ నగరంలో మునిసిపల్ నీటి వినియోగం పై ఇండియన్ హెల్త్ సర్వే వారితో సర్వే చేయించా మన్నారు. 86శాతం మంది ప్రజలు మున్సిపల్ నీటిని ఇష్టపడుతున్నట్టు తేలిందన్నారు. నీటి సరఫరా నుంచి పంపిణీ వరకు నిర్వహణ సరిగా ఉండాలన్నారు. నల్లాలకు మీటర్లను బిగించడం ద్వారా సరఫరా చేసే నీటిని అంచనా వేయగలు గుతామన్నారు. నల్లా కనెక్షన్ ఆన్లైన్ దర ఖాస్తు చేసుకునే విధంగా సంస్కరలు తీసు కొచ్చార న్నారు. రైన్ వాటర్ హార్వెస్టింగ్ విధానాల గురిం చి నగరంలోని ప్రజలకు, కాలనీవాసులకు, అపార్ట్మెంట్ వాసులకు చైతన్యం కలిగించాల న్నారు. మున్సిపల్ ఎస్ఈ మాట్లాడుతూ నగరం స్మార్ట్ సిటీ లో ఉన్నందున లోరా మీటర్లను ఏర్పాటు చేయడానికి గల అవకాశలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కస్టమర్ కేర్, నీటి సరఫరా విధానానికి సంబంధించి ప్రత్యేక యాప్ లను తయారు చేస్తామన్నారు. ఎక్కువగా లీకేజీలు ఏర్పడే ప్రాంతాaఱ గుర్తించి లీకేజీలు అరికడతా మన్నారు. మున్సిపల్ ఎస్ఈ భాస్కర్రెడ్డి, ఈఈలు విద్యాసాగర్, శ్రీనివాసరావు, డీఈలు రవికుమార్, రవీందర్, నరేందర్ పాల్గొన్నారు