Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తండావాసులకు తప్పని ఇక్కట్లు
నవతెలంగాణ-డోర్నకల్
నాడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న హూన్య తండా గ్రామ పంచాయతీ రాముతండా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో చేరింది. అయినా అభివృద్ధికి నోచుకోవట్లేదని తం డావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తండా నుంచి రామాపురం గ్రామ పంచాయతీ పులిగుట్ట తండ వరకు కిలోమీటర్ మేర డొంక దారే ఉంది. విద్యార్థులు, కూలీలు, ప్రజలు వివిధ పనుల నిమిత్తం రామా పురం వెళ్లాలంటగే డొంకదారి గుండానే వెళ్లాల్సి వస్తుంది. దీంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఏండ్ల తరబడి సమస్య ఉన్నా పాలకులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు రెండు జిల్లాల్లో ఉండడంతో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా రోడ్డు అభివృద్ధిని పట్టిం చుకోలేదు. ప్రస్తుతం గార్ల, డోర్నకల్ మండలాల గ్రామపంచాయతీల పరిధిలో రోడ్డు ఉంది. ఎన్నిక లప్పుడు రోడ్డు వేస్తామని హామీలివ్వడం తప్ప ఆచ రించని పరిస్థితి. రోడ్డు గుంతలమయంగా ఉండ డం, రోడ్డుకిరువైపులా ముళ్ళ చెట్లు పేరుకుపో వడంతో రాత్రి సమయంలో రాకపోకలు సాగించే వారు జంకుతున్నారు. వర్షాకాలంలో వరద నీరు మోకాళ్ల దాకా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తు తున్నాయని తండావాసులు వాపో తున్నారు. గిరిజన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించి హూన్యతండా-రాంపురం మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తండా వాసులు కోరుతున్నారు.
కొన్నేండ్లుగా ఇబ్బందులు పడుతున్నాం
కొన్నేండ్లుగా డొంక దారి గుండానే రాకపోకలు సాగిస్తున్నాం. బీటీ రోడ్డు వేయాలని ఎమ్మెల్యే, ఎంపీలను వేడుకుంటే ఎన్నికలప్పుడు రోడ్డు వేస్తామని హామీనిచ్చి నేడు విస్మరిచారు. దీంతో తండా అభవృద్ధికి నోచుకోవట్లేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి బీటీ రోడ్డు వేయాలి.
- భూక్య శ్రీను, హూన్యతండ