Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వళ్లిపోతున్న పంటలు
- డీబీఎం-31 కాల్వ షట్టర్లు పడేసిన వైనం
- చుక్క నీరందని వైనం
- మరమ్మతు చేయాలని రైతుల వేడుకోలు
నవతెలంగాణ-శాయంపేట
రబీ సీజన్లో ఎస్సారెస్పీ కాలువల ద్వారా ప్రతి ఎకరాకు సరిపడా సాగునీరందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా... ఆచరణలో మాత్రం అమలు చేయట్లేదు. దీంతో పంటలు వళ్లిపోతున్నాయనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు దామెర మండలం వద్ద ఎస్సారెస్పీ కాలువ కొట్టుకుపోవడం, గుర్తుతెలియని వ్యక్తులు షట్టర్లు కింద పడేయడంతో చుక్క నీరందని పరిస్థితి నెలకొంది. కాల్వలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతుల పంటలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతతున్నారు. ఇదే విషయమై ఎస్సారెస్పీ అధికారులకు విన్నవించినా.. నిధులు లేవనే సాకుతో పట్టించుకోవట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
శాయంపేట మండల పరిధిలోని గ్రామా లకు డీబీఎం-31 ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరందుతోంది. కాగా దామెర మండలం ల్యాదెళ్ల గ్రామం వద్ద ఎస్సారెస్పీ కాలువ కొట్టు కుపోయింది. దీంతో నీరంతా వృథాగా సమీపం లోని పంట పొలాల్లో చేరుతోంది. శాయంపేట మండలానికొచ్చే కాలువ తూము షట్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో కింద పడేయడంతో కాల్వలోకి చుక్కనీరు రావట్లేదు. ఎస్సారెస్పీ కాల్వ ద్వారా వచ్చే జలాల పైనే ఆధారపడి రైతులు రబీ సీజన్లో అత్యధిక హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగు చేశారు. వారం రోజులుగా డీబీఎం-31 కాలువ ద్వారా చుక్కనీరు రాక.. ఇటీవల ఉష్ణోగ్ర తలు పెరగడంతో పంటలకు సాగునీరందట్లేదు. మొక్కజొన్న పంటలు తల పువ్వు పీచు వేసే దశలోనే వల్లిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారు లు స్పందించి కొట్టుకుపోయిన కాలువకు మర మ్మతు చేయాలని, షట్టర్లను ఎత్తి సాగు నీరందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
నిధులు లేవంటున్నారు
ల్యాదేళ్ల గ్రామ శివారులో డీబీఎం-31 కాల్వ కొట్టుకపోయి నీరు వృథాగా పోతోంది. శాయంపేట మండలానికొచ్చే కాలువ తూము షట్టర్లు కింద పడేయడంతో కాలువల ద్వారా చుక్క నీరు రాక పంటలు ఎండిపోతున్నాయి. రైతులందరం వెళ్లి పరిశీలించాం. ఈ విషయాన్ని ఎస్సారెస్పీ అధికారులకు తెలిపినా పట్టించుకోవట్లేదు. మరమతు చేయడానికి నిధులు లేవంటూ దాట వేస్తున్నారు. ఫోన్లో కూడా అధికారులు స్పందించడం లేదు.
- గాజె రాజేందర్, టీఆర్ఎస్ రైతు కమిటీ మండల అధ్యక్షుడు
పంటలు వల్లిపోతున్నాయి
శాయంపేట శివారు సర్వే నెంబర్-392లో రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా ఖరీఫ్ లో పత్తి పంట సాగు చేశా. దిగుబడి రాకపోవడంతో పత్తి పంట తీసేసి రబీ సీజన్లో మొక్కజొన్న పంట సాగు చేశా. వ్యవసాయ బావిలో నీరు అడుగంటింది. ఎస్సారెస్పీ జలాలపై ఆధారపడి పంట సాగు చేస్తున్న. 15 రోజులుగా కాలువల ద్వారా నీరు రాక పంట వల్లిపోయింది. మరో పది రోజుల్లో తల పువ్వు పీచు వేసే దశకు చేరుకుంటుంది. సాగునీరందకుంటే పంట పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరందించి రైతాంగాన్ని ఆదుకోవాలి.
- ఉప్పునూతల అశోక్, శాయంపేట
తహసీల్దార్కు వినతి
రబీ సీజన్కు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగు నీరందించి పంటలను కాపా డాలని ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం తహసీల్దార్ హరికృష్ణకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేసి ఆయ మాట్లాడారు. రబీ సీజన్లో రెండు నెలలపాటు సమృద్ధిగా సాగునీరందింద న్నారు. 15 రోజులుగా కాల్వల నుంచి చుక్క నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి ఎస్సారెస్పీ జలాలం దించి పంటలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ జిల్లా నాయ కులు మారపెల్లి క్రాంతికుమార్, రైతులు బిక్షపతి, సదయ్య, రాజేందర్, కుమార స్వామి, కృష్ణారావు పాల్గొన్నారు.