Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ నగరంలోని ఏవీవీ కాలేజీ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఈనెల 23న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23న ఉదయం 9.35 గంటలకే ఐఎఎఫ్ హెలికాప్టర్లో ఆయన వరంగల్కు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.00 గంటలకు ఏవీవీ కాలేజీ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11.00 గంటలకు హైద్రాబాద్కు హెలికాప్టర్లో తిరిగి వెళ్లనున్నారు.